ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబును నిందితుడిగా చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టును కోరారు. హైకోర్టు విస్తృతమైన న్యాయాధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన అరుణ్‌కుమార్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ధర్మాసనం ఎదుట తన వాదన వినిపించారు. కోర్టు అనుమతితోనే తాను ఈ కేసులో వాదన వినిపిస్తున్నానన్నారు. ఈ కేసులో తెలంగాణ ఏసిబి ఇంతవరకు చంద్రబాబును ఎందుకు విచారించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో వినియోగించిన అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఏసిబి దృష్టి సారించలేదన్నారు. ఈ కేసులో ఏసిబి ప్రత్యేక కోర్టు తాజా దర్యాప్తుకు ఆదేశించడం సమంజసమేనన్నారు. అనంతరం ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది తన వాదనను గురువారం వినిపించాలని హైకోర్టు ఆదేశించింది.