ఆంధ్రప్రదేశ్
‘ఉపాధి’ పురస్కారానికి మూడు జిల్లాలు ఎంపిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 November 2016
విజయనగరం, నవంబర్ 17: జాతీయ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఇజిఎస్) జాతీయ స్థాయి పురస్కారానికి రాష్ట్రంలో విజయనగరం, అనంతపూర్, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఐదుగురు సభ్యులు గల బృందం అవార్డు ఎంపిక చేయనున్నారు. కాగా, ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో ఎన్ని పని దినాలు కల్పించారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కూలీల భాగస్వామ్యం, వౌలిక సౌకర్యాలు ఎలా కల్పించారు? వారికి ఆస్తులు ఎలా సమకూర్చగలిగారా? ఏ రకంగా వారి అభివృద్ధికి దోహదపడుతున్నారు? ఐఇపి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.