ఆంధ్రప్రదేశ్
ఆ భూముల లీజు వెనుక అవినీతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 November 2016
విజయవాడ, నవంబర్ 17: నగరంలోని సిద్ధార్థ విద్యా సంస్థలకు కోట్ల రూపాయల విలువైన భూములు అప్పగించటం వెనుక అవినీతీ వ్యవహారం దాగి వుందని వైకాపా అధికార ప్రతినిధి గౌతంరెడ్డి ఆరోపించారు. విజయవాడలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఏడాదికి కోటి రూపాయల మేర ఆదాయం లభించే అవకాశం ఉన్నా వాటిని వదులుకోడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడిందని ప్రశ్నించారు. టిడిపి నేత లోకేష్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఈ విద్యాసంస్థల వల్ల పొందిన లబ్ధిని దృష్టిలో ఉంచుకుని దానికి కృతజ్ఞతగా భూములను నామామాత్రపు లీజుకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.