ఆంధ్రప్రదేశ్‌

సచివాలయంలో మొబైల్ రైతుబజార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో మొబైల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయాలని మహిళా ఉద్యోగ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎన్ సత్యసులోచన, అదనపు కార్యదర్శి కె జానకమ్మ తదితరులు కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల నుంచి వచ్చే మహిళా ఉద్యోగులు విధుల నిర్వహణ అనంతరం మార్కెట్లకు వెళ్లే వ్యవధి తక్కువగా ఉన్నందున సచివాలయ ప్రాంగణంలో ఓ మొబైల్ రైతు బజారును ఏర్పాటుచేసి నిర్ణీత వేళలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు. త్వరలో మొబైల్ రైతు బజారు సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.