ఆంధ్రప్రదేశ్‌

పైప్ లైన్లలో ఇంటింటికి గ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: ఇంటింటికీ పైప్ లైన్‌తో గ్యాస్ సరఫరాకు సర్వం సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా కొవ్వూరు, రాజమహేంద్రవరంలో ఇంటింటికీ పైప్ లైన్‌తో గ్యాస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. మలి విడతగా వచ్చే ఏడాది జూన్ నాటికి భీమవరం, ఏలూరులో సరఫరా చేయాలని భావిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఆర్టీసీ బస్సులకు గ్యాస్ సరఫరా చేయడానికి ప్రణాళికలు రచించింది. పారిశ్రామిక రంగం, రవాణా రంగంతో పాటు ఇళ్ల అవసరాలకు పైప్ లైన్ల ద్వారా గ్యాస్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నాటికి పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసి గ్యాస్ పంపిణీ చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ ఓడరేవు వద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. జైళ్ల అవసరాల నిమిత్తం కూడా గ్యాస్‌ను పంపిణీ చేయనున్నారు. ఏటా ఐదు మిలియన్ టన్నుల గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం కలిగిన ఈ టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేయడానికి అధికారులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ల ద్వారా ఏపీకే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకూ గ్యాస్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
పైప్ లైన్‌తో గ్యాస్ పంపిణీకి సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం పైప్‌లైన్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పైప్‌లైన్‌తో గ్యాస్ పంపిణీకి ఏడు మార్గాల్లో పైప్‌లైన్ల ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ - శ్రీకాకుళం పైప్‌లైన్‌ను తూర్పు గోదావరి నుంచి విశాఖపట్నం మీదుగా విజయనగరం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు 275 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్‌లైన్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు, రవాణా వ్యవస్థను ఎంతో ఊతమిచ్చినట్లే. మల్లవరం - విజయపూర్ పైప్‌లైన్‌ను మల్లవరం నుంచి భిల్వారా మీదుగా విజయపూర్ వరకు మరో గ్యాస్ పైపులైన్ నిర్మిస్తున్నారు. 1,440 కి.మీ మేర ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. ఈ పైప్‌లైన్ నిర్మాణంతో తూర్పు గోదావరి, కృష్ణా, వరంగల్‌తో పాటు తెలంగాణలోని ఖమ్మం, రామగుండంతో పాటు ఆ రాష్ట్రంలోని మరికొన్ని ఈ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయనున్నారు. ఎన్నోర్ - నెల్లూరు పైప్‌లైన్‌ను ఎన్నోర్ - నెల్లూరు పైప్‌లైన్ వల్ల ఏపితో పాటు తమిళనాడుకు లబ్ధి చేకూరనుంది. ఏపిలోని చిత్తూరు, నెల్లూరుతోపాటు తమిళనాడులోని తిరువుళ్ళూరు మధ్య 200 కి.మీ మేర ఈ పైప్‌లైన్ నిర్మాణం సాగుతోంది. విజయవాడ - నెల్లూరు పైప్‌లైన్‌ను 350 కి.మీ మేర విజయవాడ - నెల్లూరు పైప్‌లైన్ నిర్మిస్తున్నారు. కేఎస్పీఎల్, ఈఎన్‌పిఎల్‌లను కలుపుతూ నెల్లూరు నుంచి ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా కృష్ణా జిల్లాల మీదుగా 350 కి.మీ పొడవు పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. తుమ్‌కూర్ - నెల్లూరు గ్యాస్ పైప్‌లైన్ ద్వారా నెల్లూరు నుంచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా ధబోల్ - బెంగుళూరు నుంచి వెళ్లే పైప్‌లైన్ ద్వారా రాయలసీమలోని మూడు జిల్లాలకు గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.