ఆంధ్రప్రదేశ్
సుందర సూర్యాస్తమయం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 March 2016
ఏటా మార్చి నెలలో రాజమహేంద్రవరం వాసులకు సాక్షాత్కరించే సుందర దృశ్యమిది. గోదావరి నదిపై పుష్కరాల రేవు సమీపంలోని పాత రైలు వంతెన (హేవలాక్), కొత్త రైలు వంతెన (బౌ స్ట్రింగ్) వంతెనకు సరిగ్గా మధ్యలో సూర్యాస్తమయం జరుగుతుంది. మార్చి 26 నుండి 30 వరకు ఐదు రోజులు ఈ అద్భుత అస్తమయం ఆవిష్కృతమవుతుంది. మంగళవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కనిపించిన ఈ అద్భుత అస్తమయాన్ని తిలకించడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. సెల్ఫీలు, ఫొటోలతో సందడిచేశారు.