ఆంధ్రప్రదేశ్‌

బైరెడ్డిపల్లి ఎస్సై కుమారుడు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, నవంబర్ 19: ఆడుకుంటూ వీధిలోకివెళ్లిన చిన్నారి తిరిగి రాకపోవడంతో ఎస్సై కుటుంబంలో ఆందోళన చెందుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు బైరెడ్డిపల్లె ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమోహన్ పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అన్నతో ఆడుకుంటూ శరత్‌కుమార్(3) వీధిలోకి వెళ్లాడు. తిరిగి వచ్చిన పెద్ద కుమారుడిని శరత్ ఎక్కడ అని తల్లిదండ్రులు అడుగగా తనకు తెలియదని సమాధానం చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన శరత్ తల్లి తన భర్త కృష్ణమోహన్‌కు సమాచారం అందించింది. వెంటనే పలమనేరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విస్తృతంగా గాలించారు. కాని బాలుడి ఆచూకీ లభించలేదు. ఎవరైనా కిడ్నాప్ అచేసారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. పలమనేరు డీఎస్పీ శంకర్, పలమనేరు సిఐ సురేంద్రరెడ్డి, ఎస్సై లోకేష్, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక టీముతో గాలిస్తున్నారు.