ఆంధ్రప్రదేశ్
సిఐడికి.ఉషారాణి కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 November 2016
విజయవాడ (క్రైం), నవంబర్ 19: కర్నూలు జిల్లా నంధ్యాలలో చోటు చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్ధిని ఉషారాణి ఆత్మహత్య కేసు విచారణ ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లా బద్వేలు మండలం బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీరం జయరామిరెడ్డి కుమార్తె బీరం ఉషారాణి (19) వాస్మోల్ తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కనంధ్యాలలోని ఆర్జిఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఉషారాణి బిటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కాలేజ్ హాస్టల్లో ఉంటోంది. విద్యార్ధిని ఆత్మహత్య అనంతరం ఓ లెక్చరర్ వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.