ఆంధ్రప్రదేశ్
బస్సు బోల్తాపడి ముగ్గురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 November 2016
రామభద్రపురం, నవంబర్ 20: విజయనగరం జిల్లా, రామభద్రపురం మండల కేంద్రంలోగల బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. ఎస్ఐ డిడి నాయుడు అందించిన వివరాలివి. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న నవరంగపూర్ జిల్లా బాబూఘర్ గ్రామానికి చెందిన షాహినాసుల్తాన్ (40), వాజీ మహమ్మద్ సుల్తాన్ (30), సయ్యద్ మహమ్మద్ (14 నెలలు) అక్కడికక్కడే మృతిచెందారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఈ బస్సు బోల్తాపడింది.