ఆంధ్రప్రదేశ్‌

పార్టీ మారే ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే ధైర్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తమ పార్టీ ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురి చేసి టిడిపిలో చేర్చుకుంటున్నారని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన విలేఖర్లతో ముచ్చటిస్తూ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. నాయకుడంటే విశ్వసనీయత, నిబద్ధత ఉండాలన్నారు. ఈ రెండూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేవన్నారు. తమ పార్టీనుంచి టిడిపిలోకి చేరే ఎమ్మెల్యేలు పదవుల కోసం ఆశపడి వెళుతున్నారన్నారు. కాని వారికి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలను టిడిపి ఆఫర్ చేస్తోందన్నారు. ప్రజలు ఐదు సంవత్సరాలకోసారి ఎన్నికల ద్వారా తీర్పు ఇస్తారన్నారు. ఒక పార్టీపై గెలిచి, మరో పార్టీలో చేరాలంటే ముందుగా ఆ పార్టీకి రాజీనామా చేయాలన్నారు. పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడమంటే అనైతికతని, ప్రజలు హర్షించరన్నారు. అధికార పార్టీ కుయుక్తులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.