ఆంధ్రప్రదేశ్‌

విగ్రహాల తరలింపునకు నిరసనగా దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, నవంబర్ 29: కృష్ణా జిల్లా చిక్కవరం శ్రీ బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి దేవస్థానంలోని విగ్రహాల తరలింపునకు నిరసనగా మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు నిరాహారదీక్ష చేపట్టారు. గత గురువారం రాత్రి ఆలయంలోని విగ్రహాలు శివలింగం, నందీశ్వరుడు, అమ్మవారి విగ్రహం, నవగ్రహాలు, అయ్యప్పస్వామి విగ్రహాలను అనాయంగా తరలించారని, వాటిని యథాస్థానంలో పునః ప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలోనే నిరశన దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకువెళతామన్నారు. విగ్రహాలు ఆట బొమ్మలు కాదని, నిర్వాహకులు దేవుడి బొమ్మలను ఆట బొమ్మలుగా తరలించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనకు ప్రాయాశ్చితంగా తాను నిరాహారదీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కంచి శ్రీ జయేంద్ర సరస్వతి హస్త్రాలతో ప్రతిష్ఠించిన విగ్రహాలను తొలగించిన ఘటనపై సిఎంను స్వయంగా కలిసి వివరిస్తానన్నారు.