ఆంధ్రప్రదేశ్‌

రూ. 2 లక్షలకు బిడ్డను అమ్మేసిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, డిసెంబర్ 2: రెండు లక్షల రూపాయలకు కన్న పేగు బంధం అమ్ముడుపోయింది. పొత్తిగుడ్డల మధ్య వెచ్చని తల్లిఒడిలో పాలు తాగాల్సిన పసికందు సంతానం లేని ఓ కుటుంబానికి తరలిపోవాల్సి వచ్చింది. సంచలనం కలిగించిన ఈ సంఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం వెదుళ్ళనరవ బిసి కాలనీలోశుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ చైల్డ్‌లైన్ (సిటీ) కోఆర్డినేటర్ ఎ.మేరీ, సబ్బవరం ఐసిడిఎస్ సిడిపివో శ్రీగౌరి తెలిపిన వివరాల ప్రకారం వెదుళ్లనరవ బిసి కాలనీలో నివాస ముంటున్న పోలవరపురమణమ్మ ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటికే ఆమెకు రెండవ తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు. అయితే తన 20 రోజుల పురిటి కందును అగనంపూడికి చెందిన ఇద్దరు ఆడ పిల్లల సంతానం కలిగిన కుటుంబానికి 2 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని రహస్యంగా విక్రయించింది. ఈ విషయాన్ని అక్కడి గ్రామస్థులు జిల్లా స్ర్తిశిశు సంక్షేమశాఖ పిడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె విశాఖ సిటీ చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ఎ.మేరీ, సబ్బవరం ఐసిడిఎస్ సిడిపివో శ్రీ గౌరిలను దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా అధికారులు శిశువును విక్రయించిన పోలవరపు రమణమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమె నిజాన్ని దాచిపెట్టి తమ బంధువులకు ఇచ్చానని కాసేపు, విశాఖలో ఉన్నాడని మరి కొంత సేపు చెప్పింది. దీంతో ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తుచేస్తున్న ఎస్‌ఐ తోట మల్లేశ్వరరావుకు నిందితురాలి అక్క తాను ఆ మగ బిడ్డను శనివారం తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే రూ. 2 లక్షల రూపాయలకు ఈ మగ బిడ్డను కొనుగోలు చేసిన దంపతులు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.