ఆంధ్రప్రదేశ్‌

జాతీయ స్థాయికి పోర్టు వ్యతిరేకోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 11: బందరు పోర్టు భూసేకరణ వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతానని రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు చెప్పారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన పోర్టు పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూదోపిడీని ఎదుర్కొని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, వామపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో బందరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామన్నారు. అభివృద్ధి పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్నసాగర్ పేరుతో కెసిఆర్, అమరావతి, బందరు పోర్టు పేరుతో చంద్రబాబు వేలాది ఎకరాలు రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రకరకాల జీవోలతో రైతులను మభ్యపెట్టి భూదోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టప్రకారమే రైతుల నుండి భూములు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హనుమంతరావు హెచ్చరించారు.

చిత్రం..పొట్లపాలెంలో పోర్టు బాధిత రైతుల సమస్యలు తెలుసుకుంటున్న హనుమంతరావు