ఆంధ్రప్రదేశ్‌

పొగురుపల్లిలో ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, డిసెంబర్ 19: చిత్తూరు జిల్లా గుడుపల్లె మండల పరిధిలోని పొగురుపల్లి గ్రామం వద్ద ఏడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అటు కర్నాటక, ఇటు ఆంధ్ర సరిహద్దుల్లో హల్‌చల్ చేశాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసుకున్న కాస్తో కూస్తో పంటలను సైతం ఏనుగులు ధ్వంసం చేయడమే కాకుండా వ్యవసాయ పరికరాలను కూడా ధ్వంసం చేశాయి. రైతు చంద్రారెడ్డితో పాటు మరో రైతుకు సంబంధించిన పంటలను భారీగా నష్టపరిచాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని సరిహద్దు రాష్ట్రాల గ్రామ ప్రజలు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. దీనిపై శాశ్వత పరిష్కారం తీసుకుంటే తప్ప ఏనుగులను నివారించేందుకు వేరే మార్గం లేదని రైతులు అధికారులను కోరుతున్నారు.