ఆంధ్రప్రదేశ్‌

పుష్కరిణిలో పడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 19: తిరుపతికి చెందిన ఓ మహిళ సోమవారం తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జారి పడి మృతి చెందింది. మృతదేహాన్ని భక్తులు గుర్తించి టిటిడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో జె ఇ ఓ శ్రీనివాసరాజు అధికారులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలుపలికి తీశారు. ఆమె మెడలోవున్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమె పేరు నాగరత్న(35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈసందర్భంగా జె ఇ ఓ శ్రీనివాసరాజు మాట్లాడు పుష్కరణి వద్ద భక్తుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే నాగరత్న ఎలా మృతి చెందిందో అర్థం కావడంలేదన్నారు.