ఆంధ్రప్రదేశ్
ప్యాకేజీ చట్టబద్ధతకు నోట్ఫైల్ సిద్ధం: సుజనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 December 2016
విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి చట్టబద్ధతపై క్యాబినెట్ నోట్ఫైల్ సిద్ధమైందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం ఆయన చంద్రబాబును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్యాకేజీకి చట్టబద్ధత త్వరలోనే వస్తుందని సుజనా చౌదరి చెప్పారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలపై ఈ నెల 26న స్పష్టత వస్తుందన్నారు. జనవరిలో తిరుపతిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించినట్లు కేంద్ర మంత్రి వివరించారు.