ఆంధ్రప్రదేశ్‌

ఆక్వా రైతులకు పన్ను మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 19: ఆక్వా రైతాంగానికి ఆదాయ పన్ను మినహాయింపు లభించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ రంగంలో కూడా సన్న, చిన్నకారు రైతులున్నారని, వారి కోసం నిబంధనలు సడలించి, వరి రైతు తరహాలో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఆక్వా రైతాంగాన్ని కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆక్వా రైతులు, ఆక్వా ట్రేడర్స్ సమస్యలపై సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా రంగం అంటే చాలా ఇష్టమన్నారు. గతం కంటే ఇప్పుడు ఎంతగానో ఈ రంగం వృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్రం నుండి ఏటా 27 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల లక్ష్యంకాగా ప్రస్తుతం 17 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ప్రోత్సాహానికి రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్ యూనిట్ రూ.3.70కు అందిస్తున్నామన్నారు. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించనుందని ప్రకటించారు. ప్రైవేటు కళాశాలల్లో కూడా ఆక్వా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.