ఆంధ్రప్రదేశ్‌

విహారయాత్ర బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, డిసెంబర్ 20: విహారయాత్రకు బయలుదేరిన బస్సు బోల్తాపడడంతో పలువురు విద్యార్థినులు, ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా సంజామల మండలం పరిధిలోని రెడ్డిపల్లె సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 68 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయినులు కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాల దర్శనానికి విహారయాత్రకు మంగళవారం తెల్లవారుజామున టూరిస్టు బస్సులో బయలుదేరారు. వీరి బస్సు కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో బస్సులోని విద్యార్థినులు చాకలి సుధ, ఉప్పర ఆశ, స్రవంతి, గంగోత్రి, అరుణ, పుష్పావతి, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అదే విధంగా ఉపాధ్యాయినిలు రాజేశ్వరి, శ్రవంతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్నామ్నాయ బస్సును ఏర్పాటుచేసిన విద్యార్థినిలను స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేశారు.