ఆంధ్రప్రదేశ్‌

నేడు ఏపి కేబినెట్ భేటీ ఉద్యోగుల తరలింపే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో విజయవాడకు సుమారు 12 వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారికి కావల్సిన వౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం, అదే జోష్‌తో పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే ఇసుక విధానం గురించి చర్చించనున్నారు. అలాగే, కృష్ణా పుష్కరాలపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశం శనివారం జరగనుంది. ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో నిర్వహించనున్న మహానాడుపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.