ఆంధ్రప్రదేశ్‌

బుల్లితెర నటుడి భార్య ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, డిసెంబర్ 20: భార్య ఆత్మహత్య కేసులో బుల్లి తెర నటుడు ఎస్.రమేష్‌ను మంగళవారం గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడి శ్రీనగర్‌కు సమీపంలోని విశే్వశ్వరయ్యనగర్‌లో నివాసం ఉంటున్న ఎస్.రమేష్ భార్య త్రిపురాంబిక సోమవారం రాత్రి తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. త్రిపురాంబిక (22)కు గాజువాక ప్రాంతానికి చెందిన బుల్లితెర నటుడు రమేష్‌కు గత ఏడాది డిసెంబర్‌లో వివాహం అయింది. అప్పటి నుంచి రమేష్ తల్లిదండ్రులు, అక్క, భావ త్రిపురాంబికను వేధిస్తున్నట్లు ఆమె తల్లి పుష్పవతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎసిపి రామ్మోహనరావు తెలిపారు. భార్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో రమేష్ ఇంటి వద్ద లేరు. భార్య మృతి వార్త తెలుసుకున్న రమేష్ వెంటనే హైదరాబాద్ నుండి ఇక్కడకు వచ్చారు. మృతురాలు త్రిపురాంబిక తల్లిదండ్రులు కూడా నెల్లూరు నుంచి మంగళవారం ఉదయమే గాజువాక చేరుకున్నారు. ఆ వెంటనే గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు, అడపడులు, ఆడపడు భర్త వేధింపులు కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు త్రిపురాంబిక తల్లి పుష్ప ఆరోపించారు. నిత్యం అదనపుకట్నం కోసం తన కుమార్తెను వేధించే వారని, ఈ విషయాన్ని తను పదేపదే తనకు ఫోన్‌లో చెప్పేదని ఆరోపించారు. పుష్పవతి ఫిర్యాదు మేరకు గాజువాక ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ తల్లిదండ్రులు, అక్క, బావలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.