ఆంధ్రప్రదేశ్‌

భవానీల దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ డిసెంబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో ‘ అమ్మవారి భవానీల దీక్ష’ విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో మల్లిఖార్జున మహామంటపం వద్ద ఏర్పాటు చేసిన హోమగుండంలో మంగళవారం ఉదయం సుమారు 6-45 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన చేసి తర్వాత దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి దంపతులచేత ప్రత్యేక పూజలు చేయించటంతో పాటు అమ్మవారి భవానీదీక్షల విరమణ ప్రారంభమైంది. ఉదయం హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేయించి ఈ అగ్నిని మిగతా 4 హోమగుండాల్లో వేసిన తర్వాత భవానీలు అమ్మవారిని దర్శించుకొని హోమగుండాలను దర్శించుకొని ఇరుముడులను సమర్పించుకొని తర్వాత గురుభవానీలతో దీక్షాధారులు మెడలోని దీక్ష మాలలు తీయించుకున్నారు. ఐదు రోజులూ వేకువ జాము 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసారు.