ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో టూరిస్టు బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, డిసెంబర్ 23: కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్‌లో టూరిస్టు బస్సు శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరంతా భవాని మాలధారులు కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మార్టురు గ్రామానికి చెందిన 45 మంది భక్తులు భవానిమాల ధరించి దీక్ష విరమణ నిమ్తితం టూరిస్టు బస్సులో శ్రీశైలం బయలుదేరారు. మార్గమధ్యంలో కోటప్పకొండను దర్శించుకుని శ్రీశైలం వస్తుండగా చెక్‌పోస్టు దాటిన తరువాత రామయ్య టర్నింగ్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న రేణుక(11) అక్కడికక్కడే మృతి చెందింది. గణేష్, సరస్వతి, దుర్గారావుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మంది గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరందరినీ సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్‌ల సాయంతో బస్సును తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీశైలం ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు.