ఆంధ్రప్రదేశ్‌

భార్యాబిడ్డలను చంపి భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, డిసెంబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం ఎస్సీ కాలనీకి చెందిన జెట్టి సురేష్ (32) తన భార్య సరితను (28), ఇద్దరు కుమారులు నరేందర్ (9), నాగచైతన్య(7)ను కిరాతంగా గొంతు నులిమి హతమార్చి తాను ఇంట్లోని పడక గదిలో దూలానికి చీరతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ విషాద సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. ఒకే కుటుంబంలో నలుగురు వ్య క్తులు చనిపోవడంతో ఆ గ్రామాన్ని విషాదంలో నిం పింది. వివరాలిలా ఉన్నాయి... భద్రాచలం మం డలం గుండాల కాలనీకి చెందిన జెట్టి సురేష్‌కు అ శ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెం దిన సరితతో వివాహమైంది. గుండాలలో నివసిస్తు న్న వారి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ వేధించేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట భద్రాచలం మండలం గుండాల నుంచి అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి వచ్చారు. కూలిపను లు చేసుకుని జీవించే వారిద్దరి మధ్య ఇక్కడ కూడా ఘర్షణ పడేవారు. వారికి పాలు పోసే వ్యక్తి ఆదివారం ఉదయం వెళ్లి తలుపు తట్టగా ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పాల వ్యాపారి చుట్టుపక్కల వారికి సమాచారం ఇ చ్చాడు. చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకుని ఇంటి కిటికీలోంచి చూడగా ఇంటి దూలానికి సురేష్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. సురేష్ భార్య సరిత, ఇద్దరు కుమారులు మంచాలపై విగతజీవులుగా కనిపించారు. పడక గదిలో ఉన్న రెండు మంచాల మధ్య రక్తపు మరకలు ఉన్నాయి. తల్లిబిడ్డల మృతదేహాలను పరిశీలించగా సరిత నోరు, ముక్కు, ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. పెద్ద కుమారుడు నరేందర్ నోటిలో నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. భార్యపై ఉన్న అనుమానంతోనే ఆమెను, ఇద్దరు కుమారులను శనివారం అర్ధరాత్రి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో లోపల తలుపు గడియ పెట్టి గొంతు నులిమి చంపి తాను కూడా ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అందిన సమాచారంతో అశ్వాపురం ఇన్‌ఛార్జ్ సిఐ అంబటి నర్సయ్య, ఎస్సై సంతోష్ సంఘటన స్థలాన్ని సందర్శించి సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చిత్రం..విగత జీవులుగా పడివున్న కుటుంబం