ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింజమూరు, డిసెంబర్ 26: నెల్లూరు జిల్లా వింజమూరు, ఉదయగిరి, కలిగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది. గత ఐదారు నెలలలుగా సద్దుమణిగిన భూ ప్రకంపనాలు మళ్లీ ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 2.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు దుత్తలూరులో, వింజమూరులో 1.20గంటలకు, కలిగిరిలో 2.15గంటలకు, ఉదయగిరి, వరికుంటపాడుల్లో 1.56గంటలకు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.