ఆంధ్రప్రదేశ్‌

చెక్కు బౌన్స్ కేసులో ఎమ్మెల్యేపై ఎన్‌బిడబ్ల్యు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 2: జిల్లాలోని గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఇచ్చిన రూ.20 లక్షల చెక్కు బౌన్స్ కావడంతో ఫిర్యాదీదారు పురుషోత్తమ జైన్ ఇచ్చిన ఫిర్యాదుపై జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ (మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్) ఎన్.శ్రీలక్ష్మి సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఎన్నికలకు ముందు 2013లో కెఎ నాయుడు విశాఖకు చెందిన పురుషోత్తమ జైన్ నుంచి రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ మేరకు ఆయన ఫిర్యాదీదారుకి చెక్కు అందజేశారు. చెక్కు బౌన్స్ కావడం, కెఎ నాయుడుపై సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతోఎన్‌బిడబ్ల్యు జారీ చేశారు.