ఆంధ్రప్రదేశ్‌

11 మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 20: రాష్ట్రంలో 11మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు లభించాయి. వీరిలో పలువురుకి స్థానం చలనం కలిగింది. వెయిటింగ్‌లో ఉన్న ఎక్కువ మందికి కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ డిజిపి కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న కె కృష్ణప్రసన్న, ఎస్‌వి మాధవరెడ్డిలను పిసిఎస్ అండ్ ఎస్ విభాగంలో పోస్టింగ్‌లు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ పని చేస్తున్న ఎం సత్తిబాబును విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో డిఎస్‌ఆర్‌పిగా నియమించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పి రామకృష్ణను పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు సరెండర్ చేశారు.
అదేవిధంగా వెయింటింగ్‌లో ఉన్న పి పరమేశ్వరరెడ్డికి ఏసిబి డిఎస్పీగా, ఎస్ శ్రీ్ధర్, ఎఎస్‌సి బోస్‌లను ఇంటిలిజెన్స్ డిఎస్పీలుగా, జి ఏలియా సాగర్‌ను రాజమండ్రి అర్బన్ ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీగా నియమించారు.
ఇక్కడ పని చేస్తున్న ఎస్ గంగరాజును ఏపి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు సరెండర్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా డిఎసిఆర్‌బిలో ఉన్న ఏ పల్లపురాజును తూర్పు గోదావరి జిల్లా సిసిఎస్ డిఎస్పీగా నియమిస్తూ ఇక్కడ పని చేస్తున్న పి సోమశేఖర్‌ను ఏపి పోలీసు హెడ్ క్వార్టర్స్ సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.