ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 28: వైకాపా అధినేత జగనే తన పసుపు కుంకాలు తీసేసాడని పౌర సరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత ఆరోఫించారు. శనివారం ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో ఆమె మాట్లాడుతూ పరిటాల రవిని హత్య చేసింది జగన్ కుటుంబీకులేనని, అతను ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి దాదాపు 42 దేశాల నుంచి ప్రతినిధులు పెట్టుబడులు పెట్టేందుకు విశాపట్నం వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షనేతగా వారిని స్వాగతించాల్సింది పోయి అడ్డుకునేందుకు జగన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమమంటూ స్వప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు. కాబోయే ముఖ్యమంత్రినంటూ చెబుతున్న జగన్‌కు మతి పోయిందన్నారు. జగన్‌కు ఆపార్టీలోని సీనియర్లు కనీసం అతనేం మాట్లాడాలో చెబితే బాగుంటుందన్నారు. జగన్ కాబోయే సిఎం అంటూ పదేపదే చెప్పడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. పులివెందులలో మాట్లాడే విధంగా ఎక్కడంటే అక్కడ మాట్లాడితే కుదరన్నారు. అధికారులు, పోలీసులను బెదిరించడం సభ్యత కాదన్నారు. ఇటువంటి చేష్టలను ప్రజలు అంగీకరించరన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టింది వైఎస్సేనని, ఆ ప్రభుత్వంలో ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడని జగన్ ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలంటూ మాట్లాడే హక్కే లేదన్నారు. ముఖ్యమంత్రి బాబే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తని, అందుకే పార్లమెంట్‌లో తమ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, సుజనాచౌదరి పదేపదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు. జగన్ వస్తే రాష్ట్రంలో మర్డర్లు జరుగుతాయన్నారు. పులివెందులకు నీరిచ్చినా టిడిపి ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదు, కాని బాబు అక్కడి రైతుల మేలు కోరుతూ నీరు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా జగన్ కలలు కనడం మానేసి ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలో ఆలోచించాలన్నారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిందని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని సిఎం ఉద్దేశ్యమన్నారు.