ఆంధ్రప్రదేశ్‌

యువతిపై కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఫిబ్రవరి 16: ప్రేమను నిరాకరించిన యువతిపై ప్రేమికుడు కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దేచర్ల వద్ద జరిగింది. కొవ్వూరు రూరల్ ఎస్‌ఐ ఎం సోమసుందరం తెలిపిన వివరాల ప్రకారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి చెందిన పన్ను దీప (27) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. దీప పెద్ద నాన్న కుమారుడు కిరణ్ స్నేహితుడైన కనె్నం సతీష్ అనే కొవ్వూరుకు చెందిన యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో కనె్నం సతీష్ పన్ను దీపను గత కొంత కాలంగా తనను ప్రేమించమని వేధించసాగాడు. ఆమె దీనికి నిరాకరించడంతో దీపపై కక్ష పెంచుకున్న సతీష్ గురువారం ఆటోలో రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి మరో నర్సుతో కలసి డ్యూటీ వెళ్తుండగా సతీష్ మరో ఆటోలో వారిని వెంబడించి దేచర్ల వద్ద కత్తితో ఆమెపై దాడి చేశాడు.
దీపకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుండి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కోలుకుంటోందని ఎస్‌ఐ సోమసుందరం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

చిత్రం..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీప