ఆంధ్రప్రదేశ్
‘అనంత’లో భారీగా నామినేషన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 February 2017
అనంతపురం, ఫిబ్రవరి 20: అనంతపురం, కడప, కర్నూలు పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. సోమవారం ఆఖరి రోజు 53 నామినేషన్లు దాఖలయ్యాయి.
మొత్తం 87 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. వీటిలో 62 పట్ట్భద్రుల స్థానానికి, 25 ఉపాధ్యాయ స్థానానికి వచ్చాయి. టిడిపి అభ్యర్థి కెజె.రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం జరుగుతుంది. 23వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మార్చి 9న ఎన్నికలు జరుగుతాయి.