ఆంధ్రప్రదేశ్‌

పోలీసులపై ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఫిబ్రవరి 21: జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తనను పోలీసులు ఎయిర్‌పోర్టులో నిర్బంధించి, సమావేశానికి హాజరుకాకుండా హైదరాబాద్‌కు తరలించిన ఘటనపై వైకాపాకు చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం 5వ అదనపు సివిల్ జడ్జి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. గన్నవరం అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి డి.షర్మిలకు రోజా తన న్యాయవాదుల ద్వారా వాదన వినిపించారు. డిజిపి నండూరి సాంబశివరావు, సిపి గౌతం సవాంగ్, ఏసిపిలు రాజీవ్‌కుమార్, శ్రావణి, సిఐ షహీరా బేగంలపై ఎమ్మెల్యే రోజా ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. రోజా వేసిన ప్రైవేట్ పిటిషన్ విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.