ఆంధ్రప్రదేశ్‌

విశాఖ బీచ్‌లో విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సముద్రంలో పుణ్యస్నానానికి దిగిన యువకుడు కెరటాలకు బలయ్యాడు. విశాఖ ఆర్‌కె బీచ్‌లో శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఆరిలోవ కాలనీకి చెందిన సాయిరాం (19) మృత్యువాత పడ్డాడు. సముద్ర స్నానానికి వెళ్లిన సాయిరాం ఆర్‌కె బీచ్‌లో కెరటాల ఉధృతి అధికంగా ఉండే ప్రాంతంలో గల్లంతయ్యాడు. సమీపంలోని కొంతమంది యువకుడు గల్లంతైన సంగతి గుర్తించి కోస్ట్‌గార్డ్‌ను అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే సాయిరాం కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. కొన్ని గంటల అనంతరం సాయిరాం గల్లంతైన ప్రాంతానికి దాదాపు కిలోమీటరు దూరంలోని పాండురంగా పురం వద్ద మృతదేహాన్ని కోస్ట్‌గార్డ్ గుర్తించింది. మృతి చెందిన సాయిరాం నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.