ఆంధ్రప్రదేశ్‌

రూ. 184 కోట్లతో మెగా ఫుడ్‌పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఎపిఐఐసికి అనుమతిస్తూ ఎపి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా ఫుడ్ పార్కును రూ.184.88 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎపిఐఐసి ఫుడ్ పార్క్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ కంపెనీగా మెగాఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.104.88 కోట్లను ఈక్విటీ ద్వారా, రూ.50 కోట్లను కేంద్రప్రభుత్వ గ్రాంటు, రూ.30 కోట్ల డెబ్ట్ ద్వారా రూ.184.88 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.