ఆంధ్రప్రదేశ్
డిసిఐ చైర్మన్తో ఉద్యోగుల భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 March 2017
విశాఖపట్నం, మార్చి 14: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ) ప్రైవేటుపరం చేయద్దంటూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం డిసిఐ చైర్మన్ రాజేష్ త్రిపాఠిని కలిశారు. దీనిపై చైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ డిసిఐ షేర్ల అమ్మకంపై అధికారికంగా తనకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. షేర్ల విక్రయాన్ని నిరసిస్తూ డిసిఐ ఉద్యోగులు నాలుగు రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఇకపై కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ముంబై, ఢిల్లీలోని ఉద్యోగులతో వీరు మంగళవారం సంప్రదింపులు జరిపారు. డిసిఐ ఉద్యోగులు మంగళవారం రాత్రి మరోసారి సమావేశమయ్యారు.