ఆంధ్రప్రదేశ్‌

వంద గంటల్లో 10,449 మరుగుదొడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 14: దేశంలోనే తొలిసారిగా వంద గంటల్లో 10,449 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఈ ఘనత విజయనగరం జిల్లాలోని సుంకరిపేటలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల పదోతేదీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి, మంగళవారం ఉదయం పది గంటలకు విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా గ్రామంలో మంగళవారం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు అధికారులు ఈ నిర్మాణాలను పరిశీలించారని, త్వరలోనే ప్రకటన వెలువడనుందని చెప్పారు. ఇలా ప్రజల భాగస్వామ్యంతో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టడం వల్ల 71 ఊళ్ళను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దగలిగామని చెప్పారు. ఈ గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా అమలయ్యేందుకు నిఘా కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.