ఆంధ్రప్రదేశ్‌

ఆరేళ్ల బాలుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేస్తవారపేట, మార్చి 14: అభంశుభం తెలియని ఆరు సంవత్సరాల బాలుడిని ఓ మహిళ హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లి గ్రామంలో జరిగింది. బేస్తవారపేట ఎస్సై శశికుమార్ కథనం మేరకు సింగరపల్లి గ్రామానికి చెందిన మిరియంపల్లి బాలచంద్రుడు, గురవమ్మలకు రాంచరణ్ (6) అనే కుమారుడు ఉన్నాడు. బాలచంద్రుడు అదేగ్రామానికి చెందిన గొర్లా వెంకటలక్ష్మమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. గత ఆరునెలల నుంచి బాలచంద్రుడు వెంకటలక్ష్మమ్మతో వివాహేతర సంబంధాన్ని నిరాకరించడంతో ఆగ్రహంతో బాలచంద్రుడు కుమారుడు రాంచరణ్‌ను సోమవారం మధ్యాహ్నం నుంచి ఎక్కడో నిర్బంధించి మంగళవారం ఉదయానికి హత్యచేసి వారి ఇంటివెనుక ఉన్న గడ్డివామిదొడ్డిలో పడవేసినట్లు ఎస్సై తెలిపారు. అయితే కనిపించకుండాపోయిన తమ కుమారుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. గిద్దలూరు సిఐ వి శ్రీరాం, ఎస్సై శశికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విఆర్‌ఓ వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.