ఆంధ్రప్రదేశ్‌

19న లాసెట్ ఆన్‌లైన్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 18: లా 3, 5 సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సులు, 2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం పిజి కోర్సులకు సంబంధించిన ప్రవేశపరీక్ష ఏప్రిల్ 19వ తేదీ నిర్వహిస్తున్నట్లు లాసెట్ ఛైర్మెన్, ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ తెలిపారు. శనివారం లాసెట్ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య భగవత్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయశాస్త్ర కోర్సులో ఎటువంటి ఆపరాధ రుసుం లేకుండా ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఇప్పటి వరకు 4,900 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. అలాగే రూ.500 అపరాధ రుసుంతో 27వ తేదీ వరకు, రూ.వెయ్యితో ఏప్రిల్ 5 వరకు, రూ.1,500తో ఏప్రిల్ 14 వరకు, రూ. 5 వేలతో ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 19వ తేదీ రాష్ట్రంలోని 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు.