ఆంధ్రప్రదేశ్‌

విపక్షాల అసత్య ప్రచారమే కాంగ్రెస్‌ను దెబ్బతీసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మార్చి 19: రాష్ట్ర విభజన సమయంలో నాటి ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారమే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిందని తమిళనాడు మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విభజన వాస్తవాలను ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ నమ్మకం తమకుందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం వంటిదన్నారు. అంతగా ఎదగడానికి ప్రజాదరణే కారణమన్నారు. అంతటి కాంగ్రెస్ అంతర్థానమై పోయిందనుకోవడం వైరి పక్షాల భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి జెడి శీలం మాట్లాడుతూ విభజన పేరుతో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టిన రాజకీయ పక్షాల కుట్రలను ప్రజలు గ్రహించి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ దశలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం..తెనాలిలో జరిగిన కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ సభలో ప్రసంగిస్తున్న రోశయ్య