ఆంధ్రప్రదేశ్
మండుతున్న ఎండలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 31 March 2017
విశాఖపట్నం, మార్చి 30: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. గడచిన వారం రోజుల్లో ఎండల తీవ్రత పెరిగింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఒకటి నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో చాలా ప్రాంతాలకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. తెలంగాణలోని నిజామాబాద్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రామగుండంలో 41, హైదరాబాద్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపిలో కర్నూలు, అనంతపురంలో 41 డిగ్రీల చొప్పున, తిరుపతిలో 39, గన్నవరంలో 30, తుని, నెల్లూరుల్లో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఒంగోలులో 36, కాకినాడ, విశాఖపట్నంలో 35 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ.