ఆంధ్రప్రదేశ్
ఉసురు తీసిన కుళాయి ఘర్షణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 April 2017
వరికుంటపాడు, ఏప్రిల్ 28: కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలోని ఇరువూరు గ్రామ పంచాయితీ పరిధిలోని తూర్పుపాలెంలో గురువారం రాత్రి ఈఘటన చోటు చేసుకొంది. రెండురోజుల క్రితం ఈ రెండు కుటుంబాల సభ్యులు కుళాయి వద్ద ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో సుబ్బారావు గ్రామంలో లేక పోవడంతో మరుసటి రోజు గ్రామానికి వచ్చి మద్యం సేవించి ఘర్షణ పడ్డ కుటుంబంతో ఘర్షణగా దిగాడు. వారిని తిడుతూ బెదరించడంతో నిందితులు ఐతా అండ్రయ్య, చింతకుంట్ల సునీల్ ఆవేశంలో గొడ్డలితో సుబ్బారావు తలపై మోదగా ఘటన స్థలంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక సిఐ రమణ, ఎస్ఐ ముత్యాలరావు పరిశీలించారు. శవానికి పంచనామ నిర్వహించి బంధువులకు అప్పచెప్పారు.