ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, మే 10: క్షణికావేశంతో ఓ తల్లి తన జీవితానే్న కాకుండా బంగారు భవితవున్న తన ఇద్దరు ఆడపిల్లల జీవితాలకు కూడా అంతిమ తీర్పు ఇచ్చి నీటిలోమునిగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం రామిరెడ్డి పాళ్యంలో బుధవారం జరిగింది. ఈ సంఘటన ఆగ్రామంలో విషాద ఛాయలను నింపాయి. తన బిడ్డలు, భార్య విగత జీవులయ్యారని తెలుసుకున్న ఆభర్త కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నాడు. అతనిని ఓదార్చడం గ్రామస్థులు సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. బి ఎన్ కండ్రిగ సమీపంలోని ఉగ్గుమూడి గ్రామానికి చెందిన హారిక (29) గత తొమ్మిదేళ్ల కిందట రామిరెడ్డి పాల్యెంకు చెందిన అప్పాజిప్యాక్టరీలో పనిచేస్తున్న శ్రీను (33)తో వివాహమైంది. వారి సంసార జీవితం సాఫిగానే సాగింది. వారికి తేజస్వి(4), లోహిత (6) ఇద్దరు అడపిల్లలున్నారు. అయితే దుబాయ్‌లో ఉన్న ఆమె అత్త చిట్టెమ్మ స్వగ్రామం చేరడంతో అత్తాకోడళ్ల మధ్య విభేదాల పొడచూపాయి.