ఆంధ్రప్రదేశ్‌

మూడు రైళ్ల వేళల్లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తుమ్మల చెరువు-నడికుడి స్టేషన్ల మధ్య సబ్‌వే నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి మూడు రైళ్లు నడిచే సమయాల్లో మార్పులు జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 11, 18 తేదీల్లో విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజర్ రైళ్లు నడిచే సమయాల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. జన్మభూమి రెండు గంటలు, శబరి ఎక్స్‌ప్రెస్ 1.40 గంటలు, రేపల్లె ప్యాసింజర్ రెండు గంటల పాటు నడిచే సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.