ఆంధ్రప్రదేశ్‌

ప్రజా ప్రతినిధుల హస్తం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 13:మహేష్ హవాలా రాకెట్‌లో కొందరు ప్రజాప్రతినిధులు కూడా అతనితో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. హవాలా మార్గంలో డబ్బును మలేసియా, బ్యాంకాక్, సింగపూర్ దేశాలకు మహేష్ తరలించినట్టు తేలడంతో ఉత్తరాంధ్రనుంచి ఆయా దేశాలకు తరచూ రాకపోకలు సాగించిన వారి వివరాలను కూపీ లాగుతున్నారు. గతంలో కొందరు ప్రజా ప్రతినిధులు ఈ దేశాలకు వెళ్లారన్న సమాచారాన్ని వారు రాబట్టినట్టు తెలుస్తోంది.
మహేష్‌కు ఒక ఐఎఫ్‌ఎస్ అధికారి, ఆయన బంధువులు సహకరించారని, వారి ద్వారానే శ్రీకాకుళానికి చెందిన ఒక మాజీ మంత్రి తన నల్లడబ్బును తెలుపు చేసుకునేందుకు మహేష్‌ను ఆశ్రయించాడని అంటున్నారు. ఇందులోభాగంగానే వడ్డి మహేష్ నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో ఒక డొల్ల కంపెనీ పేరిట కరెంట్ అకౌంట్ ప్రారంభించినట్టు బ్యాంకు అధికారులు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఆ కంపెనీకి ఆధారంగా మహేష్ ముందుగా పద్మప్రియ స్టోన్ క్రషర్ పేరిట ఇక్కడి ఎల్‌బిఎస్ కాలనీలో కార్యాలయం ప్రారంభించాడు. రూ. 3 కోట్లు అప్పు కావాలంటూ నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో దరఖాస్తు చేయగా అందుకు ష్యూరిటీగా అవసరమైన ఆస్తులు కావాలంటూ బ్యాంకు అధికారులు కోరినట్టు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే కోటబొమ్మాళి మండలం రాజయ్యపేట పంచాయతీలో 2.34 ఎకరాలు, జిఎన్ పేట పంచాయతీలో 4.5 ఎకరాలు కొనుగోలు చేసిన మహేష్, తర్లిపేట పంచాయతీలో సర్వే నెం. 1బిలో కొండలీజు కోసం మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. రవాణా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియని వ్యక్తులకు, ఎక్కడి నుంచో వచ్చినవారికి అనుమతులు ఇవ్వద్దంటూ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించడంతో పద్మప్రియ క్రషింగ్ క్వారీకి అనుమతి లభించలేదు. మహేష్ మాజీ మంత్రి బొత్స అనుచరుడు కావడం కూడా అనుమతి ఇవ్వకపోవడానికి కారణమని తెలిసింది.