ఆంధ్రప్రదేశ్‌

స్కూల్ బస్సు బోల్తా: సిబ్బందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 13: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు శనివారం బోల్తాపడింది. దీంతో అందులోని 18 మంది సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలూరులోని సెయింట్‌జోషఫ్ స్కూల్ సిబ్బంది ప్రచారం నిమిత్తం బస్సులో చింతకుంట గ్రామానికి వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న ఉపాధ్యాయులు హేమలత, సునంద, లక్ష్మీ, లక్ష్మీదేవి, జయరాజు, శ్రీదేవి, హనుమంతు, జగదీష్, రామతులసి, ఉలిగప్ప, వెంకటేష్, శే్వత, బాలకిసాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆలూరు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు.