ఆంధ్రప్రదేశ్‌

భీమవరంలో జగన్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 13: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ నెల 9వ తేదీన మాజీ ఎమ్మెల్యే, భీమవరం నియోజకవర్గ వైసిపి కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ కనిష్ఠ కుమారుడు సాగర్-సుధల వివాహం పట్టణంలో జరిగింది. ఈ వేడుకలను గ్రంధి శ్రీనివాస్ కుటుంబం జగన్‌ను ఆహ్వానించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్ళాల్సివచ్చింది. దీంతో జగన్ శనివారం గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రంధి ఇంటికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు గ్రంధి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. ఆశీస్సులు తీసుకున్నారు. నూతన వధూవరులు సాగర్-సుధలను పరిచయం చేయగా జగన్ వారిని ఆశీర్వదించారు. అదే విధంగా వైఎస్ అభిమానులకు కరచాలనం చేశారు.