ఆంధ్రప్రదేశ్‌

రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మే 14: నర్సీపట్నం సబ్ జైల్‌లో అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో జైలు సిబ్బంది ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొయ్యూరు మండలం పెదమాకవరం గ్రామానికి చెందిన గిరిజనుడు అడబాల రామకృష్ణ(40) నాటుసారా కలిగి ఉన్నాడని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు మరుసటి రోజున కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో సబ్ జైల్‌కు తరలించారు. సబ్ జైల్‌లో ఉన్న భర్త మృతి చెందిన సమాచారం తెలియడంతో ఆదివారం ఉదయం భార్య దారాలమ్మ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. కేసు నమోదు చేసినట్టు పట్టణ ఇన్‌చార్జ్ సిఐ కోటేశ్వరరావు తెలిపారు.