ఆంధ్రప్రదేశ్
కర్నూలు కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కర్నూలు టౌన్, మే 15: భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు కటుంబ సమేతంగా సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్కు హాజరయ్యాడు. కలెక్టర్ సత్యనారాయణకు తన సమస్యను వివరిస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోయాడు. ఇంతలో కలెక్టర్ గన్మెన్లు రైతు చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాగేశారు. ఈ సందర్భంగా రైతు శ్రీనివాసులు మాట్లాడుత తమ సమస్య పరిష్కరించకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో కలెక్టర్ సత్యనారాయణ వెంటనే రైతు భూ సమస్యకు సంబంధించిన అర్జీని క్షుణ్ణంగా చదివారు. తహసీల్దార్ శేషఫణికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓకు ఫోన్చేసి మంగళవారం ఈర్నపాడు గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక పంపాలని ఆదేశించారు.