ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛాంధ్ర అంబాసిడర్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: మహాత్మాగాంధీ 150వ జయంతి 2019 అక్టోబర్ 2తేదీ నాటికి స్వచ్ఛాంధ్రను సాధించే క్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఉత్తర్వులు జారీచేసారు. వీరిలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, కె.వరప్రసాద్‌రెడ్డి (శాంతా బయోటెక్), డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోకలే (హార్ట్‌సర్జన్), రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, శాస్తవ్రేత్త ప్రొఫెసర్ ఎస్.కిరణ్‌కుమార్, సినీ నటుడు నవీన్‌బాబు, జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు, బ్యాట్‌మింటన్ క్రీడాకారిణి పివి సింధు, గాయకుడు కేశిరాజు శ్రీనివాస్, విద్యావేత్త విద్యాఖన్నా ఉన్నారు.