ఆంధ్రప్రదేశ్‌

బాలుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మే 1: విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో కిడ్నాప్‌కు గురైన బాలుడు కొణతాల ఉదయ్ (8) హత్యకు గురయ్యాడు. బాలుడి మృతదేహాన్ని ఏలేరు కాలవ గట్టు పొదల్లో పోలీసులు ఆదివారం గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, బాలుని దుస్తుల ఆధారంగా ఉదయ్ మృతదేహాన్ని గుర్తించారు. గత శుక్రవారం గుర్తు తెలియని కొంతమంది ఉదయ్‌ను కిడ్నాప్ చేసినట్టు తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెప్పారు. తొలుత లక్ష రూపాయలు డిమాండ్ చేసిన నిందితులు, మరోసారి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి ఇంటి పరిసర ప్రాంతా ల్లో నిఘా పెట్టిన పోలీసులు బొడ్డేడ మనోజ్, కర్రి హేమంత్, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, నిందితులు నేరాన్ని అంగీకరించి కిడ్నాప్ చేసిన బాలుని హత్య చేసినట్టు అంగీకరించారు. అయితే ఉదయ్ కిడ్నాప్, హత్య సంఘటనల వెనుక ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.