ఆంధ్రప్రదేశ్‌

పచ్చని నగరంలో జగన్ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 22: దేశంలోనే సుందరనగరంగా పేరుగాంచిన విశాఖపట్నం బ్రాండ్ ఇమేజిని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ దెబ్బతీస్తోందని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. గురువారం రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి చిత్తూరు వరకు, ఇచ్ఛాపురం నుంచి తడ వరకు భూ కబ్జాలకు, సూట్ కేస్ కంపెనీలకు తెరతీసిన జగన్ బాగోతం ప్రజలకు తెలుసన్నారు. విశాఖ భూముల స్కాంను వెలికితీసి సిట్‌తో పాటు బహిరంగ విచారణకు ఆదేశించింది తమ ప్రభుత్వమైతే దొంగే దొంగ అన్నట్లుగా జగన్ ధర్నా నిర్వహించటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం మొత్తంలో పచ్చని నగరంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్‌లో చిచ్చురేపేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. హుదూద్ తుపానుతో శ్మశాన వాటికను తలపించిన విశాఖను రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధిలోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు. జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలుసని, ఆయన అధికారంలోకి రావటం కలే అన్నారు. నీ చరిత్ర చూశారు.. తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి రిమాండ్‌లో ఉన్నావు..బెయిల్ మీద తిరుగుతున్నావు.. మళ్లీ జైలుకు ఎప్పుడెళతావో తెలీదు.. నువ్వా లోకేష్ గురించి మాట్లాడేదని మంత్రి నక్కా మండిపడ్డారు. రాజధానికి అడ్డుపడి రైతుల్ని రెచ్చకొట్టి..తునిలో అల్లర్లు సృష్టించిన నేర చరిత్ర కలిగిన జగన్ ఇదే రకంగా వ్యవహరిస్తే ప్రజలు చెప్పుతో కొట్టేరోజు వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.