ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో హిజ్రా మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (గోపాలపట్నం), జూన్ 24: విశాఖలో కంటైనర్ లారీ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి భీమవరం వైపు వెళ్తున్న కంటైనర్ ట్రాలర్ ఎన్‌ఎడి జంక్షన్ వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిలవడంతో అదుపుతప్పింది. దీంతో ట్రాలర్ పైనున్న కంటైనర్ ఒక్కసారిగా పక్కకు పడిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఎన్‌ఎడి జంక్షన్‌లో భిక్షాటన చేస్తున్న ఎస్‌కె సదీనా (హిజ్రా) (38) కంటైనర్ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ఘటనలో మరో నలుగురు గాయపడగా కెజిహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్ బోల్తా పడిన సమయంలో గాజువాక నుంచి విశాఖ వైపు వచ్చే రహదారిలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదే సమయంలో అటువైపు నుంచి వచ్చే వాహనాలకు రెడ్ సిగ్నల్ పడటంతో పెద్దగా ముప్పు ఏర్పడలేదు. బోల్తా పడిన కంటైనర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

చిత్రం.. బోల్తా పడిన కంటైనర్‌ను తొలగిస్తున్న దృశ్యం